క్రైస్ట్చర్చ్: వన్డే సిరీస్ విజేతను డిసైడ్ చేసే మ్యాచ్లో భారత్ ‘ఏ’ జట్టు చెతులెత్తేసింది. అనధికారిక మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్ ‘ఏ’ తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా 5 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 1-2 తేడాతో భారత జట్టు చేజార్చుకుంది. కివీస్ జట్టు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఐదు పరుగుల తేడాతో మ్యాచ్ను అదేవిధంగా సిరీస్ను కూడా కివీస్ కైవసం చేసుకుంది.
టీమిండియా మరో ఓటమి.. సిరీస్ కివీస్ వశం